తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రానున్న వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య మెరుగుపరచాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పాలకవర్గం లేకపోయేసరికి పారిశుధ్య పడకేసే పరిస్థితి వచ్చిందని తక్షణమే అధికారులు పారిశుధ్యం పై శ్రద్ధ వహించి పారిశుద్ధ్య మెరుగుపరచాలని ఆయన కోరారు. రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు .వార్డుల్లో కాలువల్లో పేరుకుపోయిన చెత్తా,చెదారం చెత్తకుప్పల్లో దోమలు, ఇతర క్రిమి కీటకాలు చేరి చెత్త కుళ్ళిపోయి దోమలు ప్రబలి డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు ప్రజలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే వార్డుల్లో చెత్తను తొలగించి కాలువల్లో మురికి కుంటల్లో దోమల మందు పిచికారి చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారని, అలాగే పాకింగ్ మిషన్లతో దోమల పొగ కొట్టాలని ఆయన అధికారులకు నేడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ