తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, దాక్కు సహకారంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య అధికారి డా. తుకారం రాథోడ్ మాట్లాడుతూ: హెచ్ఐవీ వంటి హెపటైటిస్-బి, హెపటైటిస్-సి కూడా రక్తం ద్వారా వ్యాపించే వ్యాధులేనని, యువతలో డ్రగ్స్ వాడకం పెరగడం ఆందోళనకారణమని, వివాహానికి ముందు జాతకాలు కాదని, హెచ్ఐవీ స్థితిని తెలుసుకోవడం ఎంతగానో అవసరమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ హెచ్ఐవీ స్థితిని తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. అడిషనల్ రాజమల్లు, SPL జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ: ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రతి వ్యక్తికి తప్పనిసరి అని, “ఎవరి హెల్త్ వారు” అన్న భావనతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. డా. సైదులు గారు మాట్లాడుతూ: విద్యార్థుల్లో మొబైల్ ఫోన్ వినియోగం అధికంగా ఉన్న తరుణంలో, హెచ్ఐవీపై సరైన అవగాహన కలిగి చదువులో ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డా. తేజస్విని గారు మాట్లాడుతూ: హెచ్ఐవీ సోకి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సురక్షిత లైంగిక సంబంధాలు, సురక్షిత రక్త మార్పిడి, ఒకరు వాడిన సూదులు/సిరంజీలను మరొకరు వాడకూడదని, టాటూలు వేయించుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. హెచ్ఐవీ అంటుకునే వ్యాధి కాదని, ఇది అంటించుకునే వ్యాధి అని అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ 20 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా అవగాహన బృందం తమ ప్రదర్శనతో ప్రజలకు ఎయిడ్స్పై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ కార్యకలాపాల్లో సేవలందించిన వారికి మెమెంటోలు ప్రదానం చేయడం జరిగినది కార్యక్రమంలోAddl DMHO డా. సైదులు,Addl Dist Judge.M .రాజమల్లు,Bar Council President.లక్కినేని సత్యనారాయణ,Jr.College Princilpal రమేష్,Art medical Officer Dr.తేజస్విని, TB ప్రోగ్రాం ఆఫీసర్ డా. పుల్లారెడ్డి,NCD ప్రోగ్రాం ఆఫీసర్ Dr.మధువరన్, మరియు వైద్య సిబ్బంది, కాలేజీ సిబ్బంది,kalajathara బృందం,electronic media,SsK,DSRC TPpct,DAPcU సిబ్బంది, మరియు NGO s పాల్గొన్నడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ