తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ముంపునకు గురైన పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ వరద బాధిత కుటుంబాలకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు జిల్లా బార్ అసోసియేషన్, కొత్తగూడెం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడ బియ్యం, కందిపప్పు, వంట నూనె, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఉప్పు తదితర నిత్యావసర సరుకులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ బుధవారం 50 బాధిత కుటుంబాలకు అందజేశారు. వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన బాధితులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి వరద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలు, భోజనం మరియు ఇతర సహాయక చర్యల గురించి రెవిన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ వరద బాధితులకు సకాలంలో నిత్యవసర సరుకులను అందజేయడం మానవధర్మమని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి. రామారావు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. సుచరిత, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాయిశ్రీ, మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శివ నాయక్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఎస్.డి. సాదిక్ పాషా, చీప్ లిగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ నిరంజన్ రావు, ఏపిపి ఎన్. లావణ్య న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, అనుబ్రోలు రాంప్రసాదరావు, ఎస్.వి.రామారావు, జనపరెడ్డి గోపికృష్ణ, యాస యుగేందర్, వి.హరిప్రసాద్, పాల్వంచ తాసిల్దార్ జి.వివేక్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, పాల్వంచ రూరల్ ఎస్సై జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ