తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కమనీయం సీతారాముల కళ్యాణం.హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , వాకిటి శ్రీహరి, ఎమ్మెలేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు, శ్రీరామ నవమి పురస్కరించుకొని దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రాములవారి కళ్యాణం కన్నుల పండుగ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకోని వచ్చారు.సీఎం కు స్వాగతం పలికిన నాగా సీతారాములు ముందుగా ఐటీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి కి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా సీఎం ఆయన్ని ఆత్మీయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ