తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరిధిలోని IDOC మీటింగ్ హాల్ లో ది. 27.01.2026 మానవ వన్యప్రాణి సంఘర్షణ (Human-Wildlife Conflict) అంశంపై ఒక రోజు వర్క్ షాప్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథులుగా జిల్లా అటవీ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం . హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం, డీఎస్పీ, పాల్వంచ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా వ్యవసాయ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం, సూపరింటెండింగ్ ఇంజనీర్, TSNPDCL, భద్రాద్రి కొత్తగూడెం, అటవీ మండలాధికారులు, భద్రాద్రి కొత్తగూడెం, NGO's మరియు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో మానవులు మరియు వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు, ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అనుసరించవలసిన మార్గదర్శకాలు, తక్షణ స్పందన వ్యవస్థ (Rapid Response), వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అటవీ గ్రామ సమీప ప్రాంతాల్లో నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించవచ్చని వక్తలు సూచించారు. ఈ దిశగా అటవీ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, విద్యుత్ మరియు పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వుందని వారు చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ