తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం కు చెందిన 26వ సంవత్సరాల ఎన్. ఠాగూర్ మరియు కొత్తగూడెం కి చెందిన వివాహిత మహిళ 35 సంవత్సరాల టి.స్రవంతి వేరువేరు సందర్భాలలో తమ కుడి మోకాలికి దెబ్బ తగిలి వైద్యం కొరకు కొత్తగూడెం జనరల్ హాస్పిటల్ లో ఆర్థోపెడిక్ డాక్టర్లను సంప్రదించినారు. వారు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి ఇద్దరు పేషెంట్లకు ఏ సి ఎల్ లిగమెంట్ పూర్తిగా దెబ్బతినిందని నిర్ధారించారు వారికి నవంబర్ ఒకటో తారీకు ఆర్థోపెడిక్ వైద్య బృందం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ నరసింహారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్, అనస్సటిస్ట్ డాక్టర్ రమేష్,స్టాఫ్ నర్స్ రాజేష్ మరియు వేద బృందం అధునాతన ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ (ఆల్ ఇన్సైడ్ టెక్నిక్) ద్వారా ఏసీఎల్ లిగమెంటు శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినారు. ఇద్దరు పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా నడవడం ప్రారంభించారు. ఇలాంటి అధునాతన శస్త్ర చికిత్సలు కొత్తగూడెం జనరల్ హాస్పిటల్ లో నిర్వహించడానికి తమ పూర్తి సహకారం అందించిన కలెక్టర్ జితేష్ పాటిల్ గారికి, సూపరిండెంట్ ఎం రాధా మోహన్ మరియు ప్రిన్సిపల్ ఎం శ్రీహరి రావు కు వైద్య బృందం తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ