Friday, 19 June 2026 04:31:40 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

యువత, కళాకారులు, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పిలుపు

Date : 07 August 2025 05:41 PM Views : 539

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ – ఈశాన్య భారత కలయిక: ఒక సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం" – లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్ డిజైన్ పోటీకి సృజనాత్మక ఎంట్రీలు కోరుతూ పిలుపుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత, విద్యార్థులు, కళాకారులు మరియు డిజైనర్లు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటుకునే సువర్ణావకాశంగా,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం, రాజ్‌భవన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న"తెలంగాణ – ఈశాన్య భారత కలయిక: ఒక సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం"సందర్భంగా లోగో డిజైన్, ట్యాగ్‌లైన్ రచన, పోస్టర్ రూపకల్పనలపై ఓపెన్ పోటీకి ప్రజల నుండి సృజనాత్మక ఎంట్రీలు కోరుతున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.ఈ మహోత్సవం 2025 నవంబర్ 25–27 మరియు డిసెంబర్ 2–4 తేదీలలో హైదరాబాద్‌లో రెండు దశలుగా నిర్వహించబడనుందని,ఈ వేడుక ప్రధాన ఉద్దేశం – తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల (NE States) మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరస్పర మార్పిడికి వేదిక కల్పించడం అని కలెక్టర్ గారు వివరించారు. పోటీకి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయని కలెక్టర్ గారు వివరించారు. పోటీ విభాగాలు:1. లోగో డిజైన్ 2. ట్యాగ్‌లైన్ రచన3. పోస్టర్ రూపకల్పన (A4/A3 సైజులో, డిజిటల్ ఫార్మాట్)ఎంట్రీల సమర్పణ మార్గదర్శకాలు:లోగో: ఒరిజినల్, స్కేలబుల్ PNG & ఎడిటబుల్ ఫార్మాట్ (AI/CDR/PSD) ట్యాగ్‌లైన్: ఇంగ్లీషులో, 10 పదాలకు లోపు, పోస్టర్: 300 డీపీఐ PNG లేదా PDF ఫార్మాట్ సబ్మిట్ చేయుటకు:ఇమెయిల్: telangananortheastconnect@gmail.com Subject Line: Entry for Logo/Tagline/Poster – [మీ పేరు] చివరి తేదీ: 15 ఆగస్టు 2025ఎంట్రీతో పాటు పంపవలసిన వివరాలు:పూర్తి పేరు ,వయసు, వృత్తి ,మొబైల్ నంబర్, ఇమెయిల్ ఛిచిరునామా లేదా ఐడి ప్రూఫ్ , 50–100 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న ఆలోచన వివరాలు , నగదు బహుమతులు:ఉత్తమ లోగో డిజైన్ – ₹15,000 , ఉత్తమ ట్యాగ్‌లైన్ – ₹5,000 , ఉత్తమ పోస్టర్ డిజైన్ – ₹20,000అధికారిక సన్మాన కార్యక్రమం:ఎంపికైన విజేతలకు రాజ్‌భవన్, హైదరాబాద్ లో జరిగే అధికారిక కార్యక్రమంలో ఘన సన్మానం లభిస్తుంది. విజేతల డిజైన్‌లు, ట్యాగ్‌లైన్లు తెలంగాణ ప్రభుత్వ ప్రచారంలో భాగంగా వినియోగించబడతాయని కలెక్టర్ గారు తెలిపారు.ముఖ్య నిబంధనలు*:అన్ని ఎంట్రీలు ఒరిజినల్‌గా ఉండాలి. కాపీరైట్ ఉల్లంఘనలు ఉండకూడదు .ప్లాజియరిజం (నకలు) నిషేధం .లోగోలో తృతీయ పక్ష ఫోటోలు, ఐకాన్లు వాడకూడదు . ఎంపిక ప్రమాణాలు: సృజనాత్మకత, ఒరిజినాలిటీ, సాంకేతిక నైపుణ్యం, విజువల్ ఆకర్షణ . ఎంపికైన ఎంట్రీలు రాజ్‌భవన్ మేధోసంపత్తిగా పరిగణించబడతాయి . ఒక్కరే బహుళ ఎంట్రీలు పంపవచ్చు – అయితే ప్రతి ఎంట్రీని విడిగా పంపాలి . జిల్లా కలెక్టర్ గారి పిలుపుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ –"ఇలాంటి పోటీలు, ఉత్సవాలు జిల్లాలోని యువతకు తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప వేదిక.తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబించేలా మీరు రూపొందించే డిజైన్‌లుభవిష్యత్‌లో ప్రభుత్వ ప్రచారాల్లో భాగంగా ఉపయోగించబడతాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలు, కళాశాలలు, కళాకారులు చురుకుగా పాల్గొనాలి.ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలి" అని తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: