తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 01 (తెలుగు వెలుగు) : సిపిఐ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా వాడవాడలా139 వ మేడే జెండా కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు మరియు పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో వార్డులోని అంబేద్కర్ చమన్ వెనక, నేతాజీ బస్తి , ఇందిరమ్మ కాలనీ, నాగయ్య గడ్డ బర్మా క్యాంప్ ఐదు ప్రాంతాల్లో మే డే కార్మికుల జెండా ఆయా ప్రాంతాల్లోని సీనియర్ నాయకులు తమ్మ రాజమ్మ, మహబూబ్ అలీ, మార్తమ్మ తో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునిగడప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక, కర్షక, సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండ ,దండ ఒక ఎర్రజెండా మాత్రమేనని ఎర్రజెండా నీడలో కార్మికుల హక్కులు కాపాడుతున్నాయని ఆయన అన్నారు 1886లో చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిచిన జెండానే ఎర్రజెండాఅని ఈ సందర్భంగా వారు ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గం ఎర్రజెండా నీడలో అభివృద్ధి చెందుతుందని మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ గా అవతరించిందని గుర్తు చేశారు. మహిళలకు నీటి కష్టాలు ఉండొద్దని ఇంటింటికి కిన్నెరసాని మంచి నీళ్లు అందించేందుకు పనులు వేగవంతంగా కొత్తగూడెం టౌన్ లో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భయన ఈశ్వరయ్య, అజరయ్య ,శాఖా కార్యదర్శులు తమ్మ సత్తి, సూరిమేని జనార్ధన్, తమ్మ ప్రేమ్ కుమార్, రామ్ రాకేష్, ఉపతల శ్రీను ,సుబ్బని పాపారావు, రాజు, గుంజ వెంకన్న, సుభానాలి, రాజేశ్వరరావు, తమ్మ శ్రావణ్, నసీం, భూపతి ,మేడిపల్లి కవిత, బూర వెంకటమ్మ ,పాముల రాధ, దేవపుత్ర రాజమణి , చల్ల రమ్య, నందిని, కోటేశ్వరి, బోల్లొద్దుల నిశాంత్, అక్బర్ ,మీరా, సుమంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ