తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండల కేంద్రంలోని బస్ స్టేషన్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణికులకు బస్సులు అందుబాటులో లేక బస్సులు బస్టాండ్లో ఆగక నాన ఇబ్బంది పడుతున్న మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి.ఈ సందర్భంగా ఈరోజు చండ్రుగొండ బస్టాండ్ లో కరెంటు మీటర్ కై 6000/- రూపాయలను డిడి తీసి కరెంటు అధికారులకు అందజేసిన సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి. త్వరలో బస్టాండ్ లో కరెంట్ తీసుకువచ్చి లైట్లలను అమర్చి బస్సులు ఆగే విధంగా కృషి చేస్తున్న సర్పంచ్ రుక్మిణి మాట్లాడుతూ అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ సహకారంతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో NSUI మండల అధ్యక్షులు వసీం పాషా పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ