తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రెండు రోజులు జిల్లా అధికారులందరూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని, మిగతా రెండు రోజులు కూడా పూర్తి శ్రద్ధతో, కార్యక్రమాల్లో పాల్గొనాలని, రేపు గురువారం నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఫీవర్ సర్వే జరగాలని అంగన్వాడి ఆశ ఆరోగ్యశాఖ సిబ్బంది జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి జ్వర పిడుతుల వివరాలు సేకరించాలని, ప్రజలను కాచి చల్లార్చిన నీరు తాగాల్సిందిగా తెలపాలని ఎవరికైనా జ్వరం వచ్చి ఉంటే మందులు ఇచ్చి, అవసరమైతే ఆసుపత్రికి వెంటనే తీసుకువెళ్లాలని, డెంగ్యూ మలేరియా అనుమాన కేసులకు వెంటనే రక్త పరీక్షలు చేయించాలని ఆదేశించారు.
అదేవిధంగా వనమహోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, హెల్త్ సెంటర్లో, అంగన్వాడి సెంటర్లలో విధిగా ఔషధ మొక్కలైన తులసి,ఇన్సులిన్, రణపాల నేల ఉసిరి,తిప్పతీగ మొక్కలు, మరియు మునగ,కరేపాకు వెలగ,ఉసిరి,, చింత, పనస 100% నాటాలని, జిల్లా కలెక్టర్ పర్యటనలో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉండి ఈ మొక్కలు నాటక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ సిబ్బంది, ఎంపీ ఓలు, ఎంపీడీవోలు, గ్రామాలలో గల వార్డుల వారీగా డాగ్ సర్వే నిర్వహించి, కుక్కల సంతతి నిలుపుదలకు చర్యలు చేపట్టడానికి నివేదిక సమర్పించాలన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా రోడ్ల పక్కన నీరు నిల్వ ఉండే స్థలాన్ని గుర్తించి ఆ నీటిని ఇంకుడు గుంతల ద్వారా నివారించాలని సూచించారు. ఇంకుడు గుంతలు కావలసిన ప్రతిపాదనలు వెంటనే కలెక్టర్ కార్యాలయమునకు సమర్పించాలని ఆదేశించారు.
అదేవిధంగా జిల్లాలోని మెయిన్ రోడ్లలో గోతులు పడ్డచోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసే కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.09-08-24 శుక్రవారం నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వకార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, శుభ్ర పరచాలని వర్షాకాలం వల్ల దోమల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులందరూ చిత్తశుద్ధితో తమ తమ కార్యాలయల పరిసరాలు శుభ్ర పరుచుకోవాలని ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ