తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దమ్మపేట మండలం,గుండుగులపల్లి రైతువేదికలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతిప్రణాళిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది వ్యవసాయ విద్యుత్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సమావేశానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు రైతులకు మరియు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలు సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగ అభివృద్ధి సబ్సిడీ ద్వారా అందిస్తున్న రుణాలు యాంత్రికరణ పనిముట్ల సరఫరా గురించి రైతులకు వివరించారు విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న గృహజ్యోతి 24 గంటల ఉచిత కరెంట్ నూతనంగా చేపట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ప్రయోజనాలను వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని గ్రామీణాభివృద్ధి మరియు రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, జిల్లా విద్యుత్ అధికారి మహేందర్ , రెండు శాఖల ఉన్నతాధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్ర రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు రైతులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ