తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడల్లో గెలుపోటములు సహజమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. పాల్వంచ సంగం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ ముగింపు పోటీలకు ముఖ్య అతిధిగా టీపీసీసీ నాగా సీతారాములు హాజరయ్యారు. క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ మెంటం బలరాం, చింతల లక్ష్మణ్, పిల్లి సర్వేశ్, తిరుమలరెడ్డి శరత్, బోరం యేసు, రెంటాల సుందర్రావు పాల్వంచ మండలం కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం రాము లతో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని, మాదకద్రవ్యాలు వదిలి క్రీడల పట్ల మక్కువ చూపి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని క్రీడా స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి సమస్య పరిష్కార మార్గాలకు పాటుపడాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగం గ్రామ సర్పంచ్ బానోతు రవికుమార్,నాగారం సర్పంచ్ దారావత్ స్వప్న ,45వ డివిజన్ కార్పొరేటర్ దంతేబోయిన నరేష్ , నారాయణరావుపేట ఉప సర్పంచ్ సంతోష్, ఓబీసీ పట్టణం అధ్యక్షులు జయప్రకాష్ ,ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల.వెంకటేశ్వర్లు,.మోదుంపారపు గణేష్, కంటి నరేష్, పాకాల కార్తీక్, అడ్వకేట్ శోభారాణి, స్వాతి స్కూల్ చైర్మన్ నీలిమ, బృందావన్ రెస్టారెంట్ జై పార్క్ ఓనర్ జిల్, సింగరేణి రిటైర్డ్ జనరల్ మేనేజర్ శనగ వెంకటేశ్వర్లు, ప్రముఖ జర్నలిస్టు శనగ రామచంద్ర రావు, సాయిచంద్ మరియు టిఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ