తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ ( ) కొత్తగూడెం సోసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు ఆధ్వర్యంలో, సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సింగభూపాలెం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగభూపాలెం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. ఆనాడు నిర్మించిన ఇంజనీరింగ్ కళ, నైపుణ్యంకు నిదర్శనం అని కొనియాడారు. గతంలో సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని కానీ వచ్చిన నిధులతో చేసిన పనుల్లో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని, అధికారులతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ రఘు రాంరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, సహకారంతో తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు లకు పూర్తి నివేదికను సమర్పించి ప్రత్యేక నిధులను మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భద్రం, కిసాన్ కాంగ్రెస్ నాయకులు మడిపల్లి శ్రీనివాస్, పైడా ప్రసాద్, నాగార్జున, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగం పిచ్చిరెడ్డి, భాగం.మోహన్ రావు, రాచబంటి. బాబు,ఎట్టి.బాష్కర్, పెద్దమళ్ళ.రాములు, గరిక. సాంబయ్య, బైరు.సాంబయ్య గరిక.జయరాజు, నర్రా.అజయ్, గురిజాల.సీతయ్య,భద్రూ,అమృ,చిమట.నాగేశ్వరావు,నాగయ్య,శ్రీను,జిల్లా యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె అబిద్,సెక్రటరీ కోటేష్ నాయక్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి. కరీమ్ పాషా, యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, ప్రసాద్, సూరయ్య , కోటి, వేణు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ