Sunday, 19 April 2026 06:00:14 PM
# మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె.

ఇందిరమ్మ ఇండ్లను వెంటనే విడుదల చేయాలి. సుజాతనగర్ బిజెపి మాజీ మండల అధ్యక్షులు భూక్యా రాజేష్ నాయక్

Date : 21 June 2025 07:41 PM Views : 871

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు భారతీయ జనతా పార్టీ సుజాతనగర్ మాజీ మండల అధ్యక్షులు భూక్యా రాజేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సుజాతనగర్ మండలంలో ఇప్పటివరకు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి కోమటిపల్లి గ్రామపంచాయతీ తప్ప మిగతా ఏ ఒక్క పంచాయతీలో కూడా ఒక్క ఇల్లును కూడా మంజూరు చేసి ఇండ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కానీ శంకుస్థాపనలు చేసిన పనులు గాని లేవు. ఈ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఈ రాష్ట్రంలోనే ఏకైక సీటు సంపాదించి పోటీ చేసి గెలిచినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే అయిన కునంనేని సాంబశివరావు గారు ఇంతవరకు సుజాతనగర్ మండలంలోని ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఇంటి పట్టాలు ఇచ్చి శంకుస్థాపనలు చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పుకుంటూ కాలం వెళ్లతీసుకున్నటువంటి రెవిన్యూ మంత్రి గారు , సొంత ఉమ్మడి జిల్లాలో మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయం లో వారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండల ప్రజలు ఏం పాపం చేసరని మండల ప్రజల తరఫున ప్రశ్నించారు ఇందిరమ్మ రాజ్యమంటూ అబద్ధాల హామీలు ఇస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా మేల్కొని వాస్తవాలు చెప్పి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని , రైతు భరోసా తో పాటు రైతు కూలీ ఆత్మీయ భరోసా కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు . ఇప్పటికైనా ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతు, గిరిజన ప్రాంతమైనటువంటి సుజాతనగర్ మండలాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :