తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్నబియా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం అందజేసిన సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలోని లబ్ధిదారులైన మైనార్టీ సోదరిమణులు ఎండి.సుల్తానా, షాహేన, సోఫియా, షాభా ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500కె గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చటం, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొల్లు పద్మ, లక్ష్మీదేవిపల్లి మండల నాయకులు ఐకే సత్యనారాయణ, బావ్ సింగ్, మాజీ ఉపసర్పంచ్ మహేష్, మాజీ కౌన్సిలర్ మసూద్, కొల్లు కొండలరావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ