తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది.14.10.2025న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సుబ్బంపేట గ్రామ శివార్లలో చర్ల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని వెంబడించి పట్టుకోవడం జరిగింది.విచారణ జరుపగా అతని పేరు ముత్యబోయిన ప్రేమ్చంద్ అలియాస్ బన్నీ,తండ్రి: లేటు సతీష్,వయస్సు: 21 సంవత్సరాలు, వృత్తి:వ్యవసాయం నివాసం:శివాలయం వీధి వెంకటాపురం,ములుగు జిల్లా స్వగ్రామం సురవీడు,వెంకటాపురం మండలం అని తేలింది.తన స్నేహితుడి గ్రామమైన చర్ల మండలంలోని గాంధీనగరం నకు వచ్చి మూడు రోజులపాటు అక్కడ వారి ఇంట్లో నివాసం ఉండి చుట్టుప్రక్కల తాళాలు వేసి ఉన్న ఇండ్లను గమనించడం జరిగింది.అదే గ్రామానికి చెందిన కోడిరెక్కల భాస్కరరావు గారి ఇంటిని గమనించి తేదీ 09.10.2025న అర్ధరాత్రి సమయంలో వారి ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి ఆ తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి 66.414 గ్రాముల బంగారు నగలను మరియు 80 వేల రూపాయల నగదును దొంగలించడం జరిగింది.భాధితుడి ఫిర్యాదు మేరకు చర్ల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.ఇంటర్మీడియట్ చర్ల నందు పూర్తి చేసి డిగ్రీ చదువుకోవడం కోసం భద్రాచలం మదర్ థెరిసా కాలేజీ నందు చేరడం జరిగింది.నిందితుడు మద్యం మరియు ఇతర చెడు అలవాట్లకు అలవాటు పడి నేరాలు చేయడం ద్వారా డబ్బులను త్వరగా సంపాదించవచ్చని భావించి అందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.అనంతరం అతనిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో గట్టిగా విచారించగా గత వారం చర్ల మండలంలోని గాంధీ నగరంలో గల ఇంట్లో తాను దొంగతనం చేశానని ఆ దొంగతనానికి సంబంధించి బంగారు నగలను తన వద్ద ఉంచుకొని నగదు 80000 తన యొక్క అవసరాల నిమిత్తం ఖర్చు చేసుకున్నానని అంగీకరించాడు.ఈ రోజు చర్ల మండలం కొయ్యూరు నందు తన స్నేహితుడిని కలవడానికి వస్తుండగా అతడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద గల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.అనతరం రిమండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగినది.దొంగిలించబడిన పూర్తి బంగారు నగలను (66.414 గ్రాములు, విలువ 7,60,000/-) నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగినది.ఈ సమావేశంలో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి,కేశవ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ