తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈనెల 30వ తారీఖున పోలీస్ వాహనములకు సంబంధించిన పాత టైర్లు, పాత బ్యాటరీలు మరియు వాహన విడిభాగాలను హేమచంద్రపురం నందుగల పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఓ.సుధాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది. వేలంపేటలో పాల్గొనడానికి ఆసక్తిగలవారు ది 30.05.2026 ఉదయం 9:00 గంటలకు హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకోవాల్సిందిగా కోరడమైనది, వేలంపాటలకు సంబంధించిన వివరములు తెలుసుకోవడానికి MT0 ఫోన్ నెంబర్: 8712682145 కు సంప్రదించగలరు.
Admin
తెలుగు వెలుగు టీవీ