తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో గురువారం నాడు విద్యాసంస్థల ముందు విక్రయిస్తున్న గుట్కా, సిగరెట్, పాన్ పరాగ్ వివిధ మత్తు ద్రవ్యాలను విక్రయించకుండా చూడాలని కొత్తగూడెం డీఎస్పీ గారికి పిటీషన్ రూపంలో మెమోరన్నం ఇవ్వడం జరిగింది. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే,ఫహీమ్ దాదా మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని యువజన విద్యార్థులకు పిలుపునిచ్చారు, అదేవిధంగా విద్యాసంస్థల ముందు సిగరెట్స్, గుట్కా పాన్ పరాక్ వంటి మత్తు ద్రవ్యాలను విక్రయించడం వల్ల విద్యార్థులు తెలిసి తెలియని వయసులో వాటికి ఆకర్షితులై జీవితాలను ఆగం చేసుకుంటున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థల ముందు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇష్టానుసారంగా, బస్తీలలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని 24 గంటలు బెల్టు షాపుల్లో మద్యపానం విక్రయిస్తూ యువత జీవితాలతో ఆటలాడుకుంటూ యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న బెల్టు షాపులను తొలగించాలని ఈ దేశ భవిష్యత్తు విద్యార్థి యువకులేని వారిని చెడు మార్గంలో పోనియకుండా ఆపే బాధ్యత మనందరిపై ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, ఉపేందర్, సురేష్, రణధీర్, బానోత్ శ్రీను, వంశీ, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ