Wednesday, 15 April 2026 06:31:29 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

సీతారామ ప్రాజెక్టు కాల్వ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ MLA కి వినతి పత్రం

Date : 29 October 2024 04:28 PM Views : 974

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 29(తెలుగు వెలుగు) జులూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన లంబాడీ గిరిజన రైతులకు సీతారామ ప్రాజెక్టు కాల్వ కింద పోడు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ మంగళవారం వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసారు.ఎలకలోడ్డు గ్రామ సమీపాన 17 మంది రైతులు ఉమ్మడిగా గత 20 సంవత్సరాల క్రితం పోడు భూములు సాగు చేసుకుని జీవిస్తున్నాంమని,అట్టి పొడు భూములు సీతారామ ప్రాజెక్టు కాలువ కింద కోల్పోయామని,ప్రభుత్వం వారు మాకు ఎటువంటి నష్టపరిహారాన్ని అందించలేదని రైతులు విన్నవించారు.భూములు కోల్పోయిన మాకు నష్టపరారాన్ని అందించాలని కోరుతూ అనేకసార్లు సంబంధిత అధికారులకు, సీతారామ ప్రాజెక్టు ఎస్ డి సి పాల్వంచవారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పెట్టుకున్నా మా గోడు పట్టించుకోలేదని రైతులు ఆపోయారు. గతంలో భూములకు పట్టా హక్కు కల్పించాలని కోరుతూ ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకున్నామని, ఎఫ్ఆర్సి కమిటీ సమావేశం జరిగిన సందర్భంగా కాల్వ కింద భూమి కోల్పోయిన మా భూములకు నష్టపరిహారం అందించాలని కోరినామని తెలిపారు.ఎఫ్ఆర్సి కమిటీ కూడా మా భూములకు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారని, కాల్వ పనులు మొదలు పెట్టడం వల్ల సర్వేకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఎఫ్ఆర్సి కమిటీ సర్వే చేయలేదని రైతులు ఎమ్మెల్యే కి వివరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కాలువ కింద కోల్పోయిన మా భూములను సమగ్రంగా సర్వే చేయించి, రైతులకు నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. అందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో సంప్రదించి నష్టపోతున్న రైతులకు తక్షణమే నష్టపోయారాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా నాయకులు ఎదులాపురం గోపాలరావు, బానోతు ధర్మ, మండల నాయకులు బాదావత్ జవహర్లాల్, భూక్యా లోక్య గ్రామ రైతులు బానోతు బాలు, గుగులోతు బీమా, భూక్య సక్రు, బాదావత్ బోడకా, నునావత్ సరోజిని, గుగులోతు రమణి, బాదావత్ స్వప్న, చిన్న, స్వామి, రాములు, రమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :