తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 29(తెలుగు వెలుగు) జులూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన లంబాడీ గిరిజన రైతులకు సీతారామ ప్రాజెక్టు కాల్వ కింద పోడు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ మంగళవారం వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసారు.ఎలకలోడ్డు గ్రామ సమీపాన 17 మంది రైతులు ఉమ్మడిగా గత 20 సంవత్సరాల క్రితం పోడు భూములు సాగు చేసుకుని జీవిస్తున్నాంమని,అట్టి పొడు భూములు సీతారామ ప్రాజెక్టు కాలువ కింద కోల్పోయామని,ప్రభుత్వం వారు మాకు ఎటువంటి నష్టపరిహారాన్ని అందించలేదని రైతులు విన్నవించారు.భూములు కోల్పోయిన మాకు నష్టపరారాన్ని అందించాలని కోరుతూ అనేకసార్లు సంబంధిత అధికారులకు, సీతారామ ప్రాజెక్టు ఎస్ డి సి పాల్వంచవారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పెట్టుకున్నా మా గోడు పట్టించుకోలేదని రైతులు ఆపోయారు. గతంలో భూములకు పట్టా హక్కు కల్పించాలని కోరుతూ ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకున్నామని, ఎఫ్ఆర్సి కమిటీ సమావేశం జరిగిన సందర్భంగా కాల్వ కింద భూమి కోల్పోయిన మా భూములకు నష్టపరిహారం అందించాలని కోరినామని తెలిపారు.ఎఫ్ఆర్సి కమిటీ కూడా మా భూములకు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారని, కాల్వ పనులు మొదలు పెట్టడం వల్ల సర్వేకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఎఫ్ఆర్సి కమిటీ సర్వే చేయలేదని రైతులు ఎమ్మెల్యే కి వివరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కాలువ కింద కోల్పోయిన మా భూములను సమగ్రంగా సర్వే చేయించి, రైతులకు నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. అందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో సంప్రదించి నష్టపోతున్న రైతులకు తక్షణమే నష్టపోయారాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా నాయకులు ఎదులాపురం గోపాలరావు, బానోతు ధర్మ, మండల నాయకులు బాదావత్ జవహర్లాల్, భూక్యా లోక్య గ్రామ రైతులు బానోతు బాలు, గుగులోతు బీమా, భూక్య సక్రు, బాదావత్ బోడకా, నునావత్ సరోజిని, గుగులోతు రమణి, బాదావత్ స్వప్న, చిన్న, స్వామి, రాములు, రమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ