తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్,ఈనెల 21న ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మొదటగా సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ మరియు పీ.జీ కళాశాల యందు 360 మంది విద్యార్థులు ,TGSWR స్కూల్ &జూనియర్ కళాశాల (బాలికలు) పాల్వంచ సెంటర్లో 288 మంది విద్యార్థులు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అటానమస్ పాల్వంచనందు 240 మంది విద్యార్థులు,Sr Govt Arts &Science కళాశాల కొత్తగూడెం నందు 240 మంది విద్యార్థులు ఇలా మొత్తం 1,128 మంది విద్యార్థులు ఈ జిల్లా నందు పరీక్షకు హాజరుకానున్నారు.ఈ మేరకు NEET-2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కొన్ని సూచనలను చేశారు.విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు గంటలు ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మరియు ఒక్క నిమిషం ఆలస్యమైనా గేట్స్ మూసేస్తారని, అలాగే అభ్యర్థులు మీకు హాల్ టికెట్లో సూచించిన పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పరీక్ష రోజు ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ , చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు , రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని , మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించాలని సూచించారు . మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు , ఆర్నమెంట్స్, మరియు ఇతర నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రానికి తీసుకు రాకూడదని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నీట్ 2026 పరీక్ష అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష కావున విద్యార్థులు తల్లితండ్రులు మరియు పరీక్షా సిబ్బంది అందరూ ఎన్ టి ఏ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని , నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే సంబంధిత చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ