తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : కష్టజీవుల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టులేనేని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎస్సార్ గార్డెన్స్ లో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని తొలుత అరుణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు, కార్మికుల అండగా ఉంటూ సమస్యల పై ప్రశ్నిస్తూ పోరాడాది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యునిస్టు పార్టీకి ఉందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నిరుపేదలకు భూముల పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వందేళ్లు అధికారం లేకున్నా నిలబడగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక సీపీఐ అని, దాన్ని మరింత బలోపేతం చేస్తూ జనబలంతో కమ్యూనిస్టు పార్టీని అగ్రభాగాన నిలబెదాంనీ, కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉంటే వారి తరుపున పోరాడుతారు ప్రజలు గుర్తించారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి మండలంలో ప్రాతినిధ్యం ఉండే విధంగా కార్యకర్తలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని నిత్యం ఏదో ఒక మూలన మహిళలపై దాడులు, హత్యలు హత్యాచారాలు జరుగుతున్నవిని వీటిని అరికతటానికి కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు రాజకీయ రిపోర్ట్, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా జిల్లా రాజకీయ రిపోర్ట్ ప్రవేశపెట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, పుల్లారెడ్డి, కె. సారయ్య, ఏపూరి బ్రహ్మం, మున్నా లక్ష్మీ కుమారి, ఎస్ డి సలీం, నరాటి ప్రసాద్, కల్లూరి వెంకటేశ్వర్లు, రావులపల్లి రవికుమార్, కమటం వెంకటేశ్వరరావు, చండ్ర నరేంద్రకుమార్, రేసు ఎల్లయ్య, జిల్లా సమితి సభ్యులు బరిగెల సంపూర్ణ, వాసిరెడ్డి మురళి, కరిష రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, ఎస్.కె నాగుల్ మీరా, భూక్య శ్రీనివాస్, ఎస్.కె ఫయూం, భాస్కర్, మహబూబీ మండల, పట్టణ కార్యదర్శులు ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు తదితులున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ