Friday, 19 June 2026 04:31:43 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

రాజమండ్రి శిక్షణకు 11 సీట్లు - అవకాశాన్ని వినియోగించుకోవాలని వడ్రంగి/కార్పెంటర్ సంఘ పెద్దలకు సూచన : జిల్లా కలెక్టర్

Date : 07 November 2025 03:53 PM Views : 421

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, వడ్రంగి (కార్పెంటర్) సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు లభిస్తున్న అవకాశాలను వివరించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజమండ్రిలో ఈ సోమవారం నుండి ప్రారంభమయ్యే రెసిడెన్షియల్ ఫర్నిచర్ అసిస్టెంట్ శిక్షణ కోసం 11 సీట్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి శనివారం (రేపు) ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని S-20 గదిలో ఒరియంటేషన్ మరియు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు: ఒక్కొక్కరికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును జిల్లా యంత్రాంగం భరిస్తుందని, వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా ఆ సంస్థ ద్వారా కల్పించబడుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయ్యిన వెంటనే రూ. 15,000/- స్తాయిలో 6 నెలల అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని కూడా కల్పిస్తారని, అనంతరం 100% ప్లేస్మెంట్ అదే సంస్థలోనే కల్పిస్టారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో NSTI–FFSC ఆధ్వర్యంలో మొదటి విడతలో 8 మంది శిక్షణ పూర్తి చేసుకుని అప్రెంటిస్‌షిప్‌లో ఉన్నారని, రెండవ విడతలో 19 మంది అభ్యర్థులను గురువారం ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాజమండ్రి శిక్షణ కోసం ఇంకా 11 మందిని శనివారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వడ్రంగి/కార్పెంటర్ యువతతో పాటు ఆసక్తి ఉన్న ఇతర యువత కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :