తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 26 తెలుగు వెలుగు ) ; వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ ను జూలూరుపాడు మండల సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కొత్తగూడెంలోని వారి నివాసంలో శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సింగరేణి సంస్థ సహకారంతో సుమారు 80 వివిధ రకాల కంపెనీలతో వైరా నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాదిమంది యువతి యువకులకు జీవనోపాధి కల్పించినందుకు గాను, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సేవలను అభినందిస్తూ సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు తాను శక్తి మేర పాటుపడతానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచేందుకు మీడియా సహకారంతో ముందుకు వెళతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సబ్బతి శివమూర్తి, బాపట్ల మురళి, తంబర్ల పుల్లారావు, షేక్ బుడెన్ పాషా, ఉసికల రమేష్, గోగుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ