తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులురుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ కి అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోర్స రమేష్ ను పంచాయతీ ప్రజలు సర్పంచ్ గా గెలిపించారు.రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలలో కొత్తగా నియమితులైన సర్పంచుల ప్రమాణ స్వీకారం లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతారం పంచాయతీ సర్పంచిగా కోర్స రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ పంచాయతీ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్నికల వరకే రాజకీయాలు అనంతరం గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం అని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలను నిస్వార్ధంగా రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదలకు అందించే దానికి ముందు ఉంటానన్నారు అలాగే సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటూ పంచాయతీ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్దికి తోడ్పడతాన ని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నిరంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంచుతానని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ