Sunday, 19 April 2026 03:10:34 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జర్నలిస్టులు సొంత ఇంటి స్థలాల కొరకు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ మాజీ తాజా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.

Date : 21 March 2025 04:13 PM Views : 542

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ర్నలిస్టుల కొరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి 10 ఎకరాల స్థలం కేటాయించారు కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాడి 16 నెలలవుతున్న జర్నలిస్టు లకు అప్పగించకపోవడం వారిని మోసం చేయడమేనని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి ప్రభుత్వాన్ని విమర్శించారు.. శుక్రవారం పట్టణంలో గంగా బిషన్ బస్తీ లో జర్నలిస్టుల నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ఇండ్ల స్థలం మంజూరు చేసినప్పటికీ తదనంతర కాలంలో ప్రభుత్వం మారడం కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి జర్నలిస్టు ల ఇండ్ల స్థలాలు ప్రక్రియ ను ఆటకెక్కించిందని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో జర్నలిస్టు ల సమస్య ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. స్థానిక ఎంఎల్ఏ కునంనేని సాంభశివరావు సాధారణ రేటు తోనే వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని , కరోనా లాంటి కష్ట కాలంలో కూడా కుటుంబాలను వదిలి సమాజం కోసం జర్నలిస్టులు పని చేశారని , కొంత మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో జర్నలిస్టు లు చేపట్టే ప్రతీ కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, మాజీ కౌన్సిలర్ లు వేముల ప్రసాద్, అంబుల వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :