తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ర్నలిస్టుల కొరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి 10 ఎకరాల స్థలం కేటాయించారు కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాడి 16 నెలలవుతున్న జర్నలిస్టు లకు అప్పగించకపోవడం వారిని మోసం చేయడమేనని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి ప్రభుత్వాన్ని విమర్శించారు.. శుక్రవారం పట్టణంలో గంగా బిషన్ బస్తీ లో జర్నలిస్టుల నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ఇండ్ల స్థలం మంజూరు చేసినప్పటికీ తదనంతర కాలంలో ప్రభుత్వం మారడం కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి జర్నలిస్టు ల ఇండ్ల స్థలాలు ప్రక్రియ ను ఆటకెక్కించిందని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో జర్నలిస్టు ల సమస్య ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. స్థానిక ఎంఎల్ఏ కునంనేని సాంభశివరావు సాధారణ రేటు తోనే వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని , కరోనా లాంటి కష్ట కాలంలో కూడా కుటుంబాలను వదిలి సమాజం కోసం జర్నలిస్టులు పని చేశారని , కొంత మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో జర్నలిస్టు లు చేపట్టే ప్రతీ కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, మాజీ కౌన్సిలర్ లు వేముల ప్రసాద్, అంబుల వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ