Wednesday, 15 April 2026 06:31:27 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 04 November 2024 04:52 PM Views : 776

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు..... సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.. . కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఉంటున్న వికలాంగుడైన ఆగుళ్ళ మల్లేశం లోగడ వికలాంగుల కోటా కింద ప్రభుత్వం వారు టెలిఫోన్ బూత్ మంజూరు చేశారని, రాను రాను సెల్ ఫోన్ వాడకం పెరగడంతో టెలిఫోన్ బూత్ నడవక పూర్తిగా మూసివేయడం జరిగిందని, అదే ప్రదేశంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని, రైతు బజార్ నూతన నిర్మాణంలో భాగంగా నా యొక్క డబ్బాను పూర్తిగా తొలగించడం వల్ల రోడ్డును పడ్డానని, కావున దయ తలచి నూతనంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయంలో ఒక గదిని కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారు. . పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గట్టాయిగూడెం ఏడవ వార్డు లో నివాసం ఉంటున్న కాల్వ సూర్యకాంతమ్మ D/o పట్టాభిక్షం సర్వేనెంబర్ 712/అ /నాలో 12 ఎకరాల 26 కుంటల సొంత పొలం ఉన్నదని, ఆ పొలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు శాంక్షన్ అయినదని, సొంత స్థలంలో గవర్నమెంట్ రోడ్డు వేయడం పై తగు చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు. . ఇల్లందు నియోజకవర్గ కామేపల్లి మండలం ఊటుకూరు గ్రామం లో నివసిస్తున్న వడ్లకొండ బిక్షం s/o రామయ్య తనకు మూడు ఎకరాల పోడు భూమి ఉన్నదని దానిని గత 56 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తన పెద్ద కుమారుడు భార్య చనిపోవడం వల్ల గత ఎనిమిది నెలల నుండి సాగు చేయడం లేదని, దానిని అదునుగా చేసుకొని ఫారెస్ట్ అధికారులు తమ భూమినిస్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు. . బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీరాముల సక్కుబాయి w/o వీరస్వామి తను కూలీనాలీ చేసుకుని సారపాక సుందరయ్య నగర్ కాలనీలో 3.48 సెంట్లు ఇంటి స్థలం కొనుగోలు చేసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం కింద తమను చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఎండార్స్ చేశారు. . జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో వారు విధులకు హాజరు కాకపోవడం వలన గ్రామపంచాయతీలో పాఠశాలలు మరియు హాస్పిటల్స్ వద్ద దుర్వాసన రావడంతో విద్యార్థులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని భారతీయ గౌడ బంజారా పోరాట సమితి వారు చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి నివేదిక సమర్పించాలని జూలూరుపాడు ఎంపీడీవో నీ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :