Friday, 24 April 2026 07:25:26 PM
# హిందూ సమ్మేళనానికి జిల్లా ఎస్.పి రోహిత్ రాజ్ కి ఆహ్వానం. # కొత్తగూడెం ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత పరిచయ కార్యక్రమం. # పాల్వంచలో లేడీస్ జిమ్ & జుంబా స్టూడియో ఏర్పాటు. ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # సీతారామ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి తిరుగుండదు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె. # క్రీడల్లో గెలుపోటములు సహజం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # మెరుగైన సేవలు కొరకే ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే జారె. # వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: టిజిఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్ రెడ్డి. # స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల.

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 24 April 2026 03:55 PM Views : 51

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేవంత్ రెడ్డి ఏడవ హామీ ఏమైంది ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్న ప్రభుత్వం : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక సామాన్య నిరసన నుంచి భావోద్వేగ స్థాయికి చేరి,ప్రాణనష్టం దాకా వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని,ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా పరిగణించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని దాదాపు 41 రోజుల క్రితం కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడ వల్లే శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ఒడిగట్టాడని,రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు కాకుండా ఏడవ హామీ ప్రజాస్వామ్యం అని ఎవరైనా నిరాసన తెలిపే స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించి అందుకు విరుద్ధంగా నేడు సమ్మెను అణచివేసే కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు.ఆర్టీసీ కార్మికులు చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమం వెనక జై భీమ్ రావ్ భారత్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు చట్టబద్ధమైన పోరాట పందాలు కొనసాగిద్దామని ఎవరూ క్షణికావేశానికి గురై ఆత్మహత్యయత్నాలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేశారు.మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐదు కోట్ల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆకుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇంకా మొండి ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించకుండా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,జిల్లా కార్యదర్శి చెనిగరపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,శంకర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :