Sunday, 19 April 2026 03:04:09 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

బడ్జెట్ సమావేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించాలి - AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య.

Date : 13 March 2025 01:06 PM Views : 630

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనైన కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను 21000/-లకు తగ్గకుండా నిర్ణయించాలని ఏఐటీయుసి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నాడు సింగరేణి కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ - AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని,ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 21000/-లకు తగ్గకుండా చెల్లించేట్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈనెల 7వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన స్ట్రక్చరల్ సమావేశాల్లో గుర్తింపు కార్మిక సంఘం-AITUC నాయకులు మరియు గౌరవాధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచి తక్షణమే అమలు చేయాలని,కాళీ క్వార్టర్స్ ను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని,సింగరేణి లో అమలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల గైర్ హజరు పై పెనాల్టీ విధానాన్ని రద్దు పరచాలని,ESI ను అమలు చేయాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లుగా నాయకులు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకు ఒకవైపున ప్రభుత్వంపై మరియు యాజమాన్యంపై పోరాడుతూనే మరోవైపున చర్చల ద్వారా గుర్తింపు కార్మిక సంఘం తరఫున ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దేని ఆధారంగా వేతనాల పెంచడానికి అవకాశాలు ఉన్నాయో,మెరుగైన వేతనాలు చెల్లించడానికి పరిష్కారం కై ఏఐటియుసి ప్రయత్నం చేస్తుందని తెలిపారు.18 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకమైన వేతనాలను సాధించుకోవడానికి కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎం చంద్రశేఖర్,సిహెచ్ శ్రీను,గోపి,సురేష్,కళావతి, పద్మ,లక్ష్మి,ఆదిలక్ష్మి పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :