తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం ఏరియా 10.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ 3 ఇంక్లైన్ వద్ద నూతనంగా నిర్మించిన సోలార్ మోడల్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు శ్రీ డి. సత్యనారాయణ రావు డైరెక్టర్ (ఈ&ఎం) ఎల్.వి సూర్యనారాయణ డైరెక్టర్(ఆపరేషన్స్) కే.వెంకటేశ్వర్లు డైరెక్టర్( ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) చేతుల మీదుగా మోడల్ హౌస్ ప్రారంభోత్సవం చేసినారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (ఈ &ఎం) మాట్లాడుతూ ఈ సోలార్ మోడల్ హౌస్ ను దాదాపు 37 లక్షల వ్యయం తో నిర్మించామని ఈ హౌస్ లో నిర్మించుటకు ముఖ్య కారణం ముఖ్య కారణం సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విస్తీర్ణం అలాగే వాటి వివరాలను తెలియజేయగలరు హౌస్ నందు ఆర్జి. 3 ఓసి ఓబి డంపు పై ఏర్పాటు చేయబోతున్న సోలార్ ప్లాంట్ అలాగే ఎస్టిపిపి నందు ఐదు మెగా వాట్స్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అలాగే నూతనంగా నిర్మించబోతున్న 22.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వివరాలను పూర్తిగా విశ్లేషించుటకు అనువుగా ఉండేలా ఈ నిర్మాణాన్ని చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ల తో పాటు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం షాలేం రాజు, జిఎం(ఈ &ఎం) సోలార్ ఎనర్జీ జి.ఎస్.జానకి రామ్, జిఎం(ఈ &ఎం) వర్క్ షాప్ & ఎనర్జీ మేనేజ్మెంట్ పి. ఫిటజ్గెరాల్డ్ జేసురత్నం, కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి జక్కుల గట్టయ్య, ఐఎన్టియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ ఏ ఉపేందర్ బాబు, ఎస్ఓటు జిఎం జీవీ కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, ఏజిఎం (సివిల్) సిహెచ్.రామకృష్ణ, ఏజిఎం( ఫైనాన్స్) కే. హన సుమలత, డీజీఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం (ఈ&ఎం) ఏరియా వర్క్ షాప్ టి. శ్రీకాంత్, ఇతర విభాగాల అధిపతులు, సంబంధిత అధికారులు, ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ