తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు... హాజరైనారు కొత్తగూడెం ఓల్డ్ బస్ డిపో నుండి భారీ బైక్ ర్యాలీ తో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జై తెలంగాణ జై భారత్ నినాదాలతో కొత్తగూడెం క్లబ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు అభివందనాలు తెలియజేశారు ఎంపీ ఎలక్షన్లలో ఖమ్మం జిల్లాకే లక్ష 1,18,000 ఓట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు... ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొత్తగూడెం నుండి కొవ్వూరు లైన్ ఏర్పాటు చేయడానికి వెంటనే సౌత్ సెంట్రల్ జిఎం తో మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకుని ఈ సర్వే కార్యక్రమం ఎక్కడి వరకు వచ్చిందని వివరాలు తెలుసుకున్నారు. భద్రాద్రి జిల్లా అంటేనే చైతన్యం ఉన్న జిల్లా అని తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలోని 27 వేల ఓట్లు ఇచ్చిన మీకు ప్రతి బూత్ కి 200 సభ్యత్వం చేసి అగ్ర భాగాన నిలబెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు... కార్యకర్తలు అందరూ కొత్త పాత ని తేడా లేకుండా ముందుకు సాగి ఈ జిల్లాని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అక్రమంగా నిలబెడతారని ఆ విధంగా అందరూ కలిసి పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్,ఓటర్ నమోదు జిల్లా ప్రబారి శ్రీ వర్ధన్ రెడ్డి, సహ ప్రబారి రాజేష్, జిల్లా కన్వీనర్ పోనిశెట్టి వెంకటేశ్వర్లు, కో కన్వీనర్, తాటిపాము ఐలయ్య, ముసలయ్య, బైరినిర్మల, మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండురంగ చార్యులు, ముసుకు శ్రీనివాసరెడ్డి, బానోత్ విజయలక్ష్మి, కుంజా ధర్మ, పోడియం బాలరాజు, మండల అధ్యక్షులు గొడుగు శ్రీధర్ మరియు రాష్ట్ర జిల్లా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు సభ్యత్వ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ