Friday, 17 April 2026 06:39:52 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

బూర్గంపహాడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, పలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించిన సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి

Date : 09 December 2025 05:12 PM Views : 147

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులు, పంపిణీ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి మంగళవారం విస్తృత పర్యటన చేపట్టారు. ఎన్నికల విధానాలు, సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా పరిశీలకులు బూర్గంపహాడ్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామగ్రి, టోకెన్లు, బ్యాలెట్ బాక్సులు మరియు ఇతర వనరుల పంపిణీపై అక్కడి అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు సమయపాలనతో, శాస్త్రీయంగా, గందరగోళం లేకుండా చేపట్టాలని సూచించారు. మోరంపల్లి బంజార జడ్‌పీహెచ్‌ఎస్, పినపాకపట్టినగర్ జడ్‌పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ సౌకర్యాలను పరిశీలించి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు వినియోగదాయకమైన విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పారు. అనంతరం పరిశీలకులు మోరంపల్లి బంజార, అలాగే యెల్లందు క్రాస్ రోడ్ – కొత్తగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సందర్శించారు. చెక్‌పోస్ట్‌లలో డ్యూటీలో ఉన్న అధికారులతో మాట్లాడి, ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా, డబ్బు పంపిణీ, మద్యం రవాణా వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలను కట్టడి చేయడానికి ప్రతి వాహనాన్ని కచ్చితంగా మరియు పారదర్శకంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏ వాహనం కూడా తనిఖీ లేకుండా పంపితే బాధ్యత సంబంధిత అధికారులదే అవుతుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత మండల అధికారులతో పాటు పోలీస్ విభాగం, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :