Monday, 20 April 2026 01:43:36 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

విద్యార్థుల నమోదు పెంపుదల లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 14 May 2025 01:15 PM Views : 580

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు ) : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దీనికోసం నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాస్థాయిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జరుగుతున్న వృక్షంత్ర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టి విద్యను అందరికీ అందే విధంగా కృషి చేయాలన్న నాణ్యమైన విద్యను అందించడమే మార్గమని దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వృక్షంతర శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలో వినియోగించడం, మౌలిక భాష మరియు గణిత అభివృద్ధి కార్యక్రమాన్ని కృత్రిమ మేధా ఆధారంగా అభివృద్ధి పరచటం, పాఠశాల విద్యలో నూతనంగా ప్రవేశపెట్టబడుతున్న కృత్రిమ మేధ పాఠ్యాంశాలను పిల్లలకు అందించడం అనే మూడు నూతన విషయాలతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని దీనిని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరూ అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, మౌలిక వసతులలో ఏ విధమైన అంతరాలు ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కి తెలియజేస్తే సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయటానికి తప్పనిసరిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు ఎవరూ ప్రత్యామ్నాయం కాదని ఉపాధ్యాయ సర్వశక్తిమంతులని కావున వారంతా ప్రభుత్వ విద్య పరిరక్షణకు తప్పనిసరిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ,l. నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, జిల్లా రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :