తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు నూతనంగా కార్పొరేట్ ఏరియా హెడ్ ఆఫీస్ లైసెన్ ఆఫీసర్గా నియమితులైన డాక్టర్ మాలతి కొమ్ము నీ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెయిన్ హాస్పిటల్ చేతుల మీదుగా లైసెన్ ఆఫీసర్ నియామక పత్రం అందచేయడం జరిగినది. తదానంతరం అంతోటి నాగేశ్వరరావు జనరల్ సెక్రెటరీ సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ మాలతి కి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగినది. సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంగం విజ్ఞప్తి మేరకు ఎన్. బలరాం నాయక్ ఐఆర్ఎస్ సి అండ్ ఎండి, గౌతమ్ పొట్రు ఐఏఎస్ డైరెక్టర్ పా, జిఎం పర్సనల్ కవిత నాయుడు డాక్టర్ మాలతి తో సహా ఏడుగురి ఎస్సీ లైసెన్ ఆఫీసర్లను సింగరేణి వ్యాప్తంగా నియమించడం జరిగినది. సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ మహిళను కార్పొరేట్ ఏరియా లైసెన్ ఆఫీసర్ గా నియమించడం చాలా సంతోషంగా ఉన్నది అలాగే డాక్టర్ మాలతి తండ్రిగారైన కొమ్ము రంగస్వామి, ఏజీఎం ఐఈడీ రిటైర్డ్ సింగరేణి చీఫ్ లైసెన్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ పొందినారు, వారి యొక్క సేవలను గుర్తించి డాక్టర్ మాలతి మేడం ని కార్పొరేట్ ఏరియా లైసెన్ ఆఫీసర్గా నియమించడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో మేకల కనకయ్య జిఎం ఆర్ అండ్ డి, కె.రాజీవ్ కుమార్ మెయిన్ వర్క్ షాప్, డాక్టర్ సునీల, డిప్యూటీ సి ఎం ఓ, డాక్టర్ వినూత్న ,డాక్టర్ కృష్ణమూర్తి, కె.హతి రామ్ కార్పొరేట్ ఏరియా ఎస్టీలైజర్ ఆఫీసర్, కలవల చంద్రశేఖర్ డిప్యూటీ జిఎం కొత్తగూడెం ఏరియా లైసెన్ ఆఫీసర్ , జిమ్మిడి మల్లేష్ ట్రెజరర్ సెంట్రల్ కమిటీ, ఎం.చంద్రమౌళి డివైజియం ఎక్స్ప్లోరేషన్ కార్పొరేట్ , పొనుగంటి అంకుష్ సెంట్రల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొగిలిపాక రవి కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యుడు చెరిపెల్లి నాగరాజు, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యుడు, ఉర్సు సుదర్శన్ ఆర్ సి హెచ్ పి పిట్ కమిటీ సెక్రటరీ, డాక్టర్ శ్యామల చిల్డ్రన్ స్పెషలిస్ట్, మరియు బీసీ నాయకులు సకినాల సమ్మయ్య కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బీసీ సంఘం, బూర్గుల రామారావు వైస్ ప్రెసిడెంట్ ఇల్లందు ఏరియా, మరియు బిసి నాయకులు వంగపండ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ