తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శనివారం ఉదయం కార్పొరేట్ ఏరియా సెంట్రల్ వర్క్ షాప్ లో నూతన పిట్ కమిటీనీ జిఎంకి పరిచయం చేశారు.పిట్ కార్యదర్శిగా ఎ.నరేష్,అసిస్టెంట్ పిట్ కార్యదర్శులుగా నరసింహ,పల్నాటి ప్రశాంత్,రవి, అడ్వైసర్లుగా కే.రాజేశ్వరరావు, బి.రవీందర్,కొండలింగం, నీ ఎన్నుకున్నట్టు వంగ వెంకట్, రమణమూర్తి,ఒక ప్రకటనలో తెలిపి నియామకపాత్రాన్ని అందజేశారు.కార్మికుల సమస్యల పరిష్కారంకోసం పిట్ కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని ఉత్పత్తి ఉత్పాదక సజావుగా జరగడానికి కార్మిక సంఘ నాయకులు ముఖ్యపాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా తెలిపారు,సెంట్రల్ వర్క్ షాప్ లో ఎఐటియుసి పిట్ కార్యదర్శి ఎ.నరేష్ కు మరియు నూతన కమిటీ నాయకులకు ఈ సందర్భంగా సెంట్రల్ వర్క్ షాప్ కార్మికులు శుభాకాంక్షలు తెలియజేశారు,అదేవిధంగా సెంట్రల్ వర్క్ షాప్ లో గుర్తింపు సంఘం పిట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక సమస్యలు యాజమాన్యం తో నిరంతరం చర్చిస్తూ పరిష్కరిస్తాం అని పిట్ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది.సెంట్రల్ వర్క్ షాప్ లో నిస్వార్ధంగా పని చేసే కార్యకర్తలకు పిట్ కమిటీలో ముఖ్య బాధ్యతలు అప్పజెప్పి ఉత్సాహంతో పని చేసే యువకులను ఏన్నుకున్నందుకు ఎఐటియుసి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు,పిట్ కార్యదర్శి ఎ.నరేష్ మాట్లాడుతూ ఎఐటియుసి,అగ్రనాయకత్వానికి, బ్రాంచ్ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ కార్మిక సమస్యల విషయంలో రాజిలేకుండ పోరాడుతానని మేనేజ్మెంట్ మరియు యూనియన్ నాయకుల సహకారంతో ఎలాంటి కార్మికుల సమస్యలు అయిన త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ