Sunday, 19 April 2026 03:22:36 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కోల్ ఇండియా ఇంటర్ కబడ్డీ పోటీల ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య.

Date : 30 November 2025 08:05 PM Views : 179

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా వేదికగా విజేతగా నిలిచిన డబ్ల్యూసీఎల్, రన్నరప్‌గా సింగరేణి జట్లు.సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో, కొత్తగూడెం ఏరియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్ మ్యాచ్‌కు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ (ఎఐటియుసి) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఆయన తిలకించారు.ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, క్రీడలు క్రీడాకారుల మానసిక, శారీరక దృఢత్వం కోసం తప్పనిసరి అని అన్నారు. ప్రతి సంవత్సరం క్రీడల నిర్వహణ పట్ల కోల్ ఇండియా కంపెనీలు క్రీడా క్యాలెండర్‌తో ముందుకు రావడం హర్షణీయం అని అన్నారు. గెలిచినా, ఓడినా స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ ఉంటే విజయం ఎప్పటికైనా సాధ్యమవుతుందని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడాకారులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి: సీతారామయ్య డిమాండ్.అండర్‌గ్రౌండ్‌లో ఉద్యోగం కష్టంతో కూడుకున్న పని అని పేర్కొంటూ, క్రీడాకారులకు స్పోర్ట్స్ విషయంలో ఆట వరకు మాత్రమే రిలీఫ్ ఇవ్వడం వల్ల వారు రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోల్ ఇండియా మరియు సింగరేణి యాజమాన్యాలను డిమాండ్ చేశారు.గాయపడ్డ క్రీడాకారుడికి వేతనం చెల్లించడంలో ఆలస్యం వద్దు, ఈరోజు పోటీలో కబడ్డీ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డ సింగరేణి టీం క్రీడాకారుడు కార్తీక్ ను తాను సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించడం జరిగిందని సీతారామయ్య తెలిపారు. గాయపడ్డ క్రీడాకారులకు వేతనం ఇవ్వడంలో ఆలస్యం చేయకుండా, త్వరితగతిన వేతనాలు చెల్లించాలని ఆయన యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.స్పోర్ట్స్ సూపర్వైజర్లను వెంటనే నియమించాలి.క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని సుమారు పదిహేను సంవత్సరాల క్రితం స్పోర్ట్స్ సూపర్వైజర్లను నియమించారని గుర్తు చేస్తూ, ఇప్పటికైనా స్పోర్ట్స్ సూపర్వైజర్లను నియమించి వారికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.అనంతరం, హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో విజేతగా నిలిచిన డబ్ల్యూసీఎల్ (WCL) జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన సింగరేణి జట్టుకు వాసిరెడ్డి సీతారామయ్య శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, గట్టయ్య, క్రిస్టోఫర్, సుధాకర్,నరసింహారావు, హుమాయూన్, సందేబోయిన శ్రీనివాస్, మధు కృష్ణ, కమల్, ఏ.ఆర్.కె. ప్రసాద్, రాంబాబు, మండల రాజేశ్వరరావు, సాయి పవన్,తోట రాజు,మెంగన్ రవి, బన్ను వెంకటేశ్వర్లు,ప్రేమ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :