తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 20 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మనుబోలు కోటంరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు మండల వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కూటమి పార్టీల నేతలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు భూక్య రమేష్ కూటమి పార్టీ శ్రేణులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుజాతి రాజకీయాలలో చంద్రబాబు ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. జన్మదిన కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం మండల నాయకులు చలమల గోవింద్, పొదిల రామారావు, రోకటి లక్ష్మీ నరసింహారావు, దుద్దుకూరి లక్ష్మణరావు, కొండే వెంకన్న, జగదీష్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ