తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాకతీయ విశ్వవిద్యాలయం పెంచిన ఫీజులను ఉపసహరించుకోవాలి. విద్యార్థులపై భారం మోపితే ప్రభుత్వంపై ఆందోళన తప్పదు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వంపై ఆందోళన తప్పదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక శేషగిరి భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఫహీమ్ దాదా పాల్గొని మాట్లాడుతూ. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది అన్నారు. ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 80 ఉండగా ఇప్పుడు 1200 రూపాయలకు పెంచారు. రికగ్నేషన్ ఫీజు గతంలో 400 ఉండగా ఇప్పుడు 800 కు ఐయుడిఎఫ్, ఫీజు గతంలో 60 ఉండగా ఇప్పుడు 300 కు ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో 50 ఉండగా ఇప్పుడు 200 కు పెంపుదల చేసి విద్యార్థులపై తీవ్ర భారాన్ని మోపారన్నారు. ఒక్క పరీక్ష ఫీజు మాత్రమే 750 గతంలో మాదిరిగానే యధావిదంగా కొనసాగిస్తున్నారని.గతంలో ఒక్కొక్క విద్యార్థి ఆయా ఆయా అన్ని రకాల ఫీజుల క్రింద 1340 చెల్లించేవారనిఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు అన్ని కలిపి 3,250 కి పెంపుదల చేయడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.గతం కంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై 1910 రూపాయలు ఫీజు భారం పడుతుంది. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు ఏమాత్రం కట్టలేనటువంటి ఫీజుల భారాన్ని విద్యార్థులపై ప్రభుత్వం మోపడం సరికాదని తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఫీజుల భారం తగ్గించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, చంద్రగిరి ప్రసాద్, రసూల్ పాషా, కొచ్చెర్ల రాకేష్, ఎస్ కే, జావీద్, రణధీర్, కోయడా రవి, బోడ చింటూ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ