తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి ఈ రోజు పదవీ విరమణ పొందిన ఒక ఎస్సై, ఒక ఏఎస్సై మరియు ఒక హెడ్ కానిస్టేబుల్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజా ఐపిఎస్, ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు. 41 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్సై మొహమ్మద్ షఫీ ని,36 సంవత్సరాలు తమ సేవలను అందించి భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్సై సత్యనారాయణ ని మరియు అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ చిన్న వెంకటేశ్వర్లు ఈ రోజు పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ ముగ్గురు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీ తో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఏవో మంజ్యా నాయక్ మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ