Sunday, 19 April 2026 01:58:05 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎన్నికల్లో పోటీ లేని భారత్ లేబర్ ప్రజా పార్టీ రద్దు ప్రతిపాదన. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 20 August 2025 12:47 PM Views : 553

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎన్నికల్లో పోటీలో లేని రాజకీయ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ లేబర్ ప్రజా పార్టీ గత ఆరు సంవత్సరాలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గాని, రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గాని, ఉప ఎన్నికలలో గాని తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 లోని సెక్షన్ 29A ప్రకారం ఆ పార్టీ విధివిధానాలు అమలు చేయకపోవడం స్పష్టమైందని కలెక్టర్ వివరించారు. ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 లోని సెక్షన్ 29A క్రింద ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించుకుంటూ, పై పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించేందుకు ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాతినిధ్యం ఏమైనా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ఈ నెల 25వ తేదీ లోగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి అఫిడవిట్ సమర్పించవలసిందిగా సూచించారు. ఈ నెల 29వ తేదీన విచారణ నిర్వహించనున్నందున పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి సమాధానం రాకపోతే, పార్టీ తరపున ఏ అభ్యంతరం లేనట్టుగా పరిగణించి, ఎన్నికల కమిషన్ రద్దు ఉత్తర్వులు జారీ చేస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :