తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీరుగారిపోతున్న సమాచార హక్కుచట్టం : కర్నే బాబురావు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచ డమే ఉద్దేశంగా సమాచారహక్కు చట్టం ప్రభుత్వంరూపొందించిందని, కానీ మణుగూరు మండలంలో విద్యాశాఖ అధికారుల నిర్ల క్ష్యంతో సమాచార హక్కు చట్టం లక్ష్యం నీరు గారిపోతుందని, సామాజిక సేవకులు కర్నే బాబురావు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు బదిలీ అయిన ఆ అధికారుల పేర్లు, మండల విద్యాశాఖ కార్యాలయంలో నేటికీ కనిపిస్తున్నాయని, ప్రస్తుత అధికార పేర్లు లేకుండానే బోర్డులు దర్శన మిస్తున్నాయన్నారు. ప్రజలు సమాచారం కోసం విద్యాశాఖ కార్యాలయానికి వస్తే ఎవరికి దరఖాస్తు అందజేయాల్లో తెలియక అయోమయానికి గురవుతున్నారని, బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.స.హ హక్కు చట్టం ప్రకారం అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేసి దానిపై సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాయించి ప్రజలకు స్పష్టంగా కనిపిం చేలా ఏర్పాటు చేయాలి. కానీ మండల విద్యాశాఖ అధికారి ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యం గా విద్యార్థులు, ఉపాధ్యాయులకు, ప్రైవేటు విద్యా సంస్థలకు అందు బాటులో ఉండే కార్యాలయంలో అసలు స.హచట్టం బో ర్డు లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి స.హ. చట్టం బోర్డులు ఏర్పాటు చేసి సామాన్యులను, ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ