తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వల్లే నేడు అన్ని రంగాల్లో సమానత్వాన్ని పొందుతున్నాం కొత్తగూడెం టౌన్ రామవరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అలాగే సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టించి కృషిచేసి బలమైన రాజ్యాంగాన్ని నిర్మించారని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజ్యాంగం వల్లే అన్ని రంగాల్లో నేడు మహిళలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం వల్ల ప్రజాప్రతినిధులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముందంజలో ఉన్నారని అన్నారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు రామవరం పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు ఆ ప్రదేశం బహిరంగ మూత్ర విసర్జనకు కేంద్రంగా ఉంటూ దుర్గంధం వెదజల్లేదని గుర్తు చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామవరం నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ