తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడండి ...సభ్యుల వినతి ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం మేయర్ గా ఎన్నికైన మూడ్ గణేష్ ను కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో సభ్యులు గురువారం ఆయన ఛాంబర్ లో ఘనంగా సత్కరించి సన్మానించారు. మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో పెంచే మొక్కలపైన అవగాహన కల్పించేందుకు తాము సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. పదేపదే నాటడం మళ్ళీ తిరిగి నరకడం కాకుండా పకడ్బందీగా ప్లాన్ చేయాలని కోరారు. కోతుల సమస్యను అరికట్టేందుకు కొన్ని సలహాలను సూచనలను అందజేశారు. కొత్తగూడెంలో మోడల్గా కోతులకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయడం ద్వారా, కోతల సమస్యను అరికట్టవచ్చని సూచించారు. గణేష్ మాట్లాడుతూ పర్యావరణ వేత్తల, ప్రకృతి ప్రేమికుల, పై స్థాయి అధికారుల సూచనల సలహాల మేరకు దానికి పరిష్కారం త్వరలోనే కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు మేయర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం కో_ఆర్డినేటర్ జి. సుగుణారావు, పర్యావరణ వేత్త మొక్కల వెంకటయ్య, రిటైర్డ్ సింగరేణి జి.ఎం. శనగ వెంకటేశ్వర్లు, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు ముస్తఫా, మొక్కల ప్రేమికురాలు నైనిక రజువా, గౌరవ సభ్యులు దయసాగర్, బంగారీ శంకర్, నంది శశి కుమార్, జర్నలిస్ట్లు శనగ రామచందర్, దశరధరజువా, ఝాన్సీ లు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ