Monday, 20 April 2026 01:40:41 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో ఆకస్మికంగా పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

Date : 17 October 2025 07:36 PM Views : 465

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం అవగాహనా కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పాన్ షాపుల్లో పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.నిషేదిత గంజాయితో పాటు ఇతర మత్తు పదార్ధాలను నిర్మూలనే లక్ష్యంగా నిత్యం ఇలాంటి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మరియు భద్రాచలం సబ్ డివిజన్ల వారీగా డిఎస్పీల ఆధ్వర్యంలో పోలీస్ జాగిలాల సహాయంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో ఇప్పటికే గుర్తించిన గంజాయి హాట్ స్పాట్ నందు కూడా ఇట్టి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.ఎవరైనా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్దాలను విక్రయించడం గానీ,రవాణా చేయడం గానీ,సేవించడం గానీ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా వీటితో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గానీ,డయల్ 100 కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. మన జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు ప్రజలు కూడా సమాచారం అందించి సహకారం అందజేయాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :