Friday, 19 June 2026 05:50:20 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

‘ కార్మికుల భీమా పెంపు’ గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 24 November 2025 06:06 PM Views : 193

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన భీమా పెంపు వివరణలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం లో ‘కార్మికుల భీమా పెంపు’ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు మరియు అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా భీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సమాజమరణ భీమాను రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు, ప్రమాద మరణ భీమాను రూ.6 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 16.50 లక్షల కార్మికులు లబ్ధి పొందనున్నారని వివరించారు. భీమా ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండేందుకు కార్మిక శాఖ, బీమా సంస్థలు మరియు బోర్డులు సమన్వయంతో వేగంగా సేవలను అందించాలని అధికారులకు సూచించారు. భీమా క్లెయిమ్ విధానం, అవసరమైన పత్రాలు, అర్హతలు, టోల్‌ఫ్రీ నంబర్లు వంటి సమాచారాన్ని గ్రామ స్థాయి వరకు విస్తృతంగా చేరేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కార్మిక కుటుంబాలు ఏ కష్టకాలంలోనైనా ఆర్థికంగా కూలిపోకుండా రక్షించేందుకు ఈ భీమా పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :