తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన భీమా పెంపు వివరణలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం లో ‘కార్మికుల భీమా పెంపు’ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు మరియు అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా భీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సమాజమరణ భీమాను రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు, ప్రమాద మరణ భీమాను రూ.6 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 16.50 లక్షల కార్మికులు లబ్ధి పొందనున్నారని వివరించారు. భీమా ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండేందుకు కార్మిక శాఖ, బీమా సంస్థలు మరియు బోర్డులు సమన్వయంతో వేగంగా సేవలను అందించాలని అధికారులకు సూచించారు. భీమా క్లెయిమ్ విధానం, అవసరమైన పత్రాలు, అర్హతలు, టోల్ఫ్రీ నంబర్లు వంటి సమాచారాన్ని గ్రామ స్థాయి వరకు విస్తృతంగా చేరేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కార్మిక కుటుంబాలు ఏ కష్టకాలంలోనైనా ఆర్థికంగా కూలిపోకుండా రక్షించేందుకు ఈ భీమా పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ