తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 15 (తెలుగు వెలుగు)అక్టోబర్ 2024 మూడవ తారీకు నుండి విజయవంతంగా కొనసాగుతున్న సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీ మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రమునకు చేరుకుంది . ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఎంపీడీవో తాళ్లూరి.రవి మాట్లాడుతూ తెలంగాణలో క్రీడలు మరియు క్రీడా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఈ ర్యాలీని స్పూర్తిగా తీసుకొని జూలూరుపాడు మండలంలోని యువకులు అందరూ రాబోయే సీఎం కప్ 2024 నందు ఉత్సాహంగా పాల్గొనాలని కోరి ఉన్నారు. జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ క్రీడల వలన యువత శారీరకదృఢత్వం పాటు మంచి ఆరోగ్యం సిద్ధించి, మానసిక ఉల్లాసం కలిగి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చేస్తాయని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జులూరుపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య , మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఉండి సీఎం కప్ నోడల్ అధికారి మరియుయువకులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు , పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ