తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం హనుమాన్ బస్తీ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఐటీడీఏ పి.ఓ. రాహుల్ ఐఏఎస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పి. ఓ. రాహుల్ ఐఏఎస్ మాట్లాడుతూ పిల్లలను క్రీడలలో రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు,షటిల్ బ్యాడ్మింటన్,టెన్నిస్ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి మన జిల్లాలో మంచి కోచెస్ ఉన్నారని తెలిపారు.ఇంత చక్కటి టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ సెక్రెటరీ డాక్టర్ సావిత్రి ని,ఒలింపిక్ అసోసియేషన్ వారిని అభినందించారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి భారతదేశ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేసి పీవీ సింధు,కిడాంబి శ్రీకాంత్,కశ్యప్తదితర క్రీడాకారులను అందించారని కొనియాడారు వారి పేరు గవర్నమెంట్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ కి పెట్టాలని కోరారు డాక్టర్ సావిత్రి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి లేగసీ కొనసంచడానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ గుండా శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు,జిల్లా రెజ్లింగ్ అధ్యక్షులు నాగసీతారములు, బ్యాడ్మింటన్ జిల్లా ట్రెజరర్ రమేష్,వెంకీ,ఉదయ్,సంతోష్,లావణ్య,శ్రీలక్ష్మి,సీత తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ